FlipkartSearch

Thursday 19 January 2017

రాజుగారు- కర్మ  ఫలం

ఆ  రాజ్యంలో   రాజుగారు   చాలా  మంచి వాడు . ఆయన  ప్రతి  రోజూ   పేద  బ్రాహ్మణులకు  మద్యాహ్న  భోజనం  వండించి   పెట్టేవాడు  . 

ఒక  రోజు  యధావిధిగా   భోజనం   వండించే  ఏర్పాట్లు  చేస్తున్నాడు  .  అదే  సమయం  లో   ఆకాశం  లో  ఎగురుతున్న  ఒక  గద్ద  కాళ్ళతో  పట్టుకున్న  పాము  నోటినుండి  విషం  వడ్డించడానికి  సిద్ధంగా  ఉన్న   అన్నం  బేసిన్  లో  పడింది  .  అది  ఎవరూ  గమనించలేదు 
ఆభాగం  ఒక  బ్రాహ్మణుడు  తిన్నాడు .  అది   తినడం  వలన    అతడు  చనిపోయాడు .  ఈ  వార్త  రాజుగారికి  చేరింది   .   ఆయన  చాలా   దుఃఖించాడు .   మేలు  చెయ్యబోతే   ఇలా  కీడు  జరిగింది  అని  ఆయన   చింతించాడు .
.
.
ఇప్పుడు  బ్రాహ్మణుడు  చనిపోవడానికి   కారణం  ఎవరు ?
రాజా ?   వంటవాడా ?    పామా ?  గద్దా  ? వడ్డించిన  వ్యక్తా ?
.
ఈ  పాపాన్ని  ఎవరి  ఖాతాలో  వెయ్యాలి ?
.
.
వీరిలో  ఎవరూ   కావాలని  ఆ  బ్రాహ్మణుడిని   చంపలేదు .
.
.
యమ  ధర్మరాజును  అడిగారు  .
.
ఇది  ఇలా  ఉంటె  మర్నాడు    దారినే  పోతున్న  బ్రాహ్మణులు  కొందరు   అన్నదానం  జరిగే  చోటును  చెప్పమని  ఒక  వనితను  అడిగారు .  ఆమె  వారికీ  దారిని  చూపుతూ  
“  బాబూ !   జాగ్రత్త  మా  రాజు  గారికి  బ్రాహ్మణులు  అంటే   పడదు  .  నిన్ననే  ఒకాయనను  విషం  పెట్టి  చంపేశారు”    .  మీ  రోజులు  బాగున్నాయో   లేదో  ?   అంది  .
.
ధర్మరాజు  గారు
“ చిత్రగుప్తా !    మొత్తం  పాపం  అంతా  ఈమె   ఖాతాలో  వెయ్యి .
యాదృచ్చికంగా    జరిగే   పనులకు   వ్యక్తులను  నిందించే  వారికి   ఆ  మొత్తం  కర్మ  ఫలం  కలుగుతుంది  అని  ధర్మం .”  అన్నారు .
.
Moral Of The Story :-
When We Criticise  Others, We Take Up Their  KARMA .!!
Please like it and share it.

1 comment:

  1. This story has been extracted from ancient Hindu stories..Got is as a forward message and updated in the blog as its moral is good.

    ReplyDelete